ముగిసిన రాష్ట్ర స్థాయి హాకీ సబ్ జూనియర్ టోర్నమెంట్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి హాకీ సబ్ జూనియర్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. టోర్నమెంట్ లో ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొనగా…. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. టోర్నమెంట్ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. నిజామాబాద్, నల్గొండ రెండు, మూడవ స్థానాలను సాధించాయి. టోర్నమెంట్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానం చేసి అభినందించారు. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.జిల్లాలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల నిర్వాహకులకు అభినందనలు తెలియచేశారు. తెలంగాణా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, యూనుస్ అక్బని రాష్ట్రపాల్ తో పాటు పలువురు క్రీడాకారులు, కోచ్ లు పాల్గొన్నారు.