Chitram news
Newspaper Banner
Date of Publish : 10 June 2025, 5:54 pm Editor : Chitram news

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఖానాపూర్ ఎంఎల్ఏ వెడ్మ బొజ్జు పటేల్

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఖానాపూర్ ఎంఎల్ఏ వెడ్మ బొజ్జు పటేల్

*ఖానాపూర్ ఎంఎల్ఏ వెడ్మ బొజ్జు పటేల్ ను సత్కరించిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క

చిత్రం న్యూస్, ఉట్నూర్: హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కని మంగళవారం ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ తదితరులు ఉన్నారు.