మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం
చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో కొలువై ఉన్న మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం మరిడమ్మ అమ్మవారికి, పౌర్ణమి సందర్భముగా చండీ హోమం నిర్వహించారు. వేదపారాయణ దారులు పూజ, అర్చన కార్యక్రమాలు చేపట్టారు. పులిహోర ప్రసాద వితరణచేశారు కార్యక్రమంలో భక్తులు,మహిళలు పాల్గొనారు. మరిడమ్మ దేవస్థానంలో బుధవారం ఉదయం 9:00గం. లకు శ్రీ అమ్మవారి హుండీలను ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు,సిబ్బంది, గ్రామస్తులు, పోలీస్ వారి సమక్షంలో హుండీలను తెరుస్తారని సహాయకమీషనర్, కార్య నిర్వహణాధికారి కే.విజయలక్ష్మి తెలిపారు.