పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు
చిత్రం న్యూస్,కొత్తపేట: రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. పంచాయితీ రాజ్ నిధులు రూ. 70 లక్షలతో దేవరపల్లి నుండి కొత్తపాలెం వరకు నిర్మించనున్న నూతన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. భూమి పూజచేసి కొబ్బరికాయ కొట్టారు. గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.15.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి ఆకుల రామకృష్ణ,కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.