యోగాoద్ర అవగాహన ర్యాలీలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
చిత్రం న్యూస్, పెదపూడి: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదపూడిలో యోగాoద్ర అవగాహన ర్యాలీలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు,పెదపూడి మండల NDA నాయకులు, తెలుగు మహిళలు, పెదపూడి గ్రామ NDA నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.