విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ఏపీ అడుగులు
*175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలు వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు
*వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చింతలపూడి శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్
చిత్రం న్యూస్, ఏలూరు: గత ఐదేళ్ల వైయస్సార్సీపి ప్రభుత్వం సాగించిన అరాచక పాలనలో జరిగిన విధ్వంసం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తుందని రోషన్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సహచర ఎంపీలతో పాటు చింతలపూడి శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా “పీ-4” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు.