బీజేపీ పార్టీ భోరజ్ మండల అధ్యక్షుడిగా గాజుల సన్నీ
*జైనథ్ మండల కార్యవర్గ సమావేశంలో ఎన్నిక
చిత్రం న్యూస్, జైనథ్: ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలన పైన బీజేపీ జైనథ్ మండల కమిటీ కార్యవర్గ సమావేశం నిరాల గ్రామంలో నిర్వహించారు. రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ ఎల్టి అశోక్ రెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, బీజేపీ జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. భోరజ్ మండల అధ్యక్షులుగా గాజుల సన్నీని ఎన్నుకున్నారు. నమ్మకంతో పదవి కట్టబెట్టినందుకు ఎంఎల్ఏ పాయల్ శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జైనథ్ మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, జైనథ్ మండల ఉపాధ్యక్షులు గౌకర్ విశాల్, నాయకులు తోట రమేష్, గజానన్, దంతెల రవీందర్,ఏనుగు సూర్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.