- పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూనె మంగాలక్ష్మి
*కొలువుదీరిన పాలకవర్గం
చిత్రం న్యూస్ ,పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆదివారం ఉదయం నూనె మంగా లక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. వైస్ చైర్మన్ గా మాదిరెడ్డి, చంద్రశేఖర్, రేలంగి వెంకట్రావు తో పాటు 13 మంది పాలకవర్గ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నేతలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.