చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పల్లె నిద్ర
చిత్రం న్యూస్, ఏలూరు: ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి కూటమి తలపెట్టిన పల్లె వెలుగు- స్వర్ణగ్రామం పథకంలో భాగంగా గ్రామాభివృద్ధిని ప్రోత్సహించేందుకు చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలు ఆకర్షించేలా నాటక ప్రదర్శనలు నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.