Njసీఎం సహాయ నిధి చెక్కు అందజేత
చిత్రం న్యూస్, పెద్దాపురం : పారాలసిస్ వ్యాధికి చికిత్స పొందుతున్న నవర గ్రామ నివాసి కొండపల్లి వీరాజుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.25,500 విలువైన చెక్కును పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు రంగనాగ్ అందజేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప రంగనాగ్ కు తోట నాగ భూషణం (నాగబాబు) కృతజ్ఞతలు తెలిపారు.