రెండు లారీలు ఢీ, ఒకరి మృతి
చిత్రం న్యూస్, హుజూరాబాద్: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి స్టేజి వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న లారీ కరీంనగర్ నుండి వరంగల్ కు వెళ్తున్న లారీ ఎదురెదురుగా రెండు ఢీకొనడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దాదాపు రెండు గంటల సేపు ట్రాఫిక్ జామ్ అయింది. సింగపూర్ మీదుగా ట్రాఫిక్ ను మళ్ళించారు. లారీ డ్రైవర్ ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియాల్సిఉంది. జెసిబి సాయంతో లారీలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేసారు.