ఆగస్టు 15 కల్లా పదిహేను లక్షల బంగారు కుటుంబాల దత్తత
* చంద్రబాబు స్పష్టీకరణ
చిత్రం న్యూస్, ఉండవల్లి: ఏపీలో ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరింత వేగవంతంగా మార్గదర్శకాల నమోదు ప్రక్రియ చేయాలని అధికారులకు సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. పీ4 విధానంపై బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధాని భూసేకరణ పీ4కు కేస్ స్టడీగా సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 70వేల కుటుంబాలకు పీ4 ద్వారా సాయం చేశామని గుర్తు చేశారు.