ఏపీలో హెల్త్ కార్డుకు సంబంధించి కీలక ప్రతిపాదన
చిత్రం న్యూస్, ఆంధ్రప్రదేశ్: ఎన్టీఆర్ వైద్య సేవ కార్డుల జారీలో కీలక మార్పులు రానున్నాయి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే వైద్య సేవలు అందించాలని శాసనసభ పిటిషన్ల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనివల్ల రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయొచ్చని, ప్రభుత్వానికి రూ.2 వేల కోట్లు ఆదా అవుతాయని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదా అయిన డబ్బును విద్యారంగానికి ఉపయోగించాలని సూచించారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తుందో లేదో వేచి చూడాలి.