Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందించాలి

మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందించాలి

*కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి 

చిత్రం న్యూస్, హుజురాబాద్:

ఆసుపత్రికి వచ్చే రోగులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.  బుధవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిని ఆమె తనిఖీ చేశారు. డయాలసిస్ సెంటర్, ఐసీయూ వార్డులు, ఓపి విభాగం సందర్శించారు. నవజాత శిశువుల వార్డు సందర్శించి పిల్లలకు వచ్చిన సమస్యలను గురించి తెలుసుకున్నారు. లేజర్ రూము, వార్డు పరిశీలన, గర్భిణుల, బాలింతలతో మాట్లాడారు. ఆసుపత్రి సిబ్బంది వారికి అందించిన సేవలను గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తల్లి పాలు ప్రాముఖ్యతను సాధారణ ప్రసవ ప్రాధాన్యతను అక్కడ మహిళలకు వివరించారు .ఇతర వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు .అనంతరం ఆసుపత్రిలో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు మెడికల్ ఆఫీసర్ల సమీక్షంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలోని అన్ని రకాల సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది కార్ల వివరాలు అడిగి సమర్పించాలని,  ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేలా సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు . ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు ముందస్తు జాగ్రత్తలు సూచించాలని వైద్య సహాయం అవసరం అనుకుంటే గర్భిణులను ప్రసవం గడుపు కంటే ముందే ఆసుపత్రిలో చేర్పించాలని అన్నారు. అప్రమాలజిస్ట్, రేడియాలజిస్ట్ డెంటిస్ట్ వంటి విభాగాల్లో వారి వారిగా ఓపి సంఖ్యను పరిశీలించారు. నెలసరి నివేదికను సమీక్షించారు. రోగుల పట్ల మానవ కోణంలో వ్యవహరించి వారికి సేవలందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా ప్రజలు ప్రైవేటు మందులు దుకాణాల్లో వేల రూపాయలు ఖర్చుతో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్ సంబంధించిన మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు లో కొనుగోలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయం ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఉచితంగా మందులు తీసుకునేలా చూడాలని సూచించారు. నవజాతి శిశువులను పిల్లల సేవలు పట్ల జాగ్రత్తగా వివరించాలని సూచించారు. ఆసుపత్రిలో ఆరోగ్య మహిళా క్యాంపును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఐకెపి సిబ్బంది ద్వారా ఆరోగ్యం మహిళా ఉచిత వైద్య పరీక్షల పట్ల మహిళలకు అవగాహన కల్పించి క్యాంపును సద్వినియోగం చేసేలా చూడాలని తెలిపారు. ఈ క్యాంపు ద్వారా సుమారు 50,000 రూపాయలు ఖరీదు చేసి 47 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్న విషయం మహిళల్లో తీసుకెళ్లాలని అన్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారి కి బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులకు మందులు అందించాలన్నారు. 108 సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. అవసరమైన సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించారు అంతకుముందు ఆసుపత్రి ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ డిసిహెచ్ చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ఆర్ఎన్ఓ డాక్టర్ రమేష్, జమ్మికుంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పారిపల్లి శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ చందు, ఆర్డీవో రమేష్బాబు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య  పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img