హుజురాబాద్ లో మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు సేవ్ ద ట్రీ నాయకుల వినతి
చిత్రం న్యూస్, హుజురాబాద్
హుజరాబాద్ పట్టణంలో వాడవాడలో విరిగిన మొక్కల స్థానంలో మళ్లీ మొక్కలు నాటాలని అందుకు ఇప్పటినుండి ఏర్పాట్లు చేయాలని సేవ్ ద ట్రీ నాయకులు, స్థానికులు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగిన చెట్లు తీసివేసి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని, వాడవాడలా సిసి రోడ్ల చివర మొక్క నాటే స్థలం కోసం డ్రిల్లింగ్ చేసి ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవ్ ద ట్రీ గౌరవ అధ్యక్షుడు సాదుల రవీంద్రబాబు, అధ్యక్షుడు మాట అనిల్, ప్రధాన కార్యదర్శిలు మక్కా పల్లి రమేష్, కుడికాల ప్రభాకర్, ప్రకాష్, విశ్రాంతి ,విక్రమ్ తదితరులు పాల్గొన్నారు