Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేత జగన్

ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేత జగన్

*మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎంఎల్ఏ నిమ్మకాయల చిన రాజప్ప

చిత్రం న్యూస్, పెద్దాపురం:

ప్రజలకు వెన్నుపోటు పొడవటం జగన్ కుటుంబానికి వాళ్ళ తాతల కాలం నుంచి అలవాటని అలాంటి కుటుంబం నుండి వచ్చిన జగన్ వెన్నుపోటు అంటూ ప్రజల ముందుకు రావడం హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ.. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేత జగన్ రెడ్డని. జగన్ తన సొంత కుటుంబాన్నే వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. లిక్కర్ తదితర కేసుల్లో వైసీపీ నేతలు వరుసగా జైలుకు వెళ్లడంతో జగన్ కు వెన్నులో వణుకు పుడుతోందని, జగన్ ఓటమి తర్వాత తన అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు వెన్నుపోటు అంటూ ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు డీఎస్సీ ప్రకటించి, దీపం పధకం అమలు చేశారని, రోడ్లకు మహర్దశ తీసుకొని వచ్చారని రాజప్ప అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజప్ప తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img