ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా విద్యార్థుల తల్లిదండ్రులపై నమ్మకాన్ని పెంపొందించాలి
*మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి
చిత్రం న్యూస్, సైదాపూర్:
ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా విద్యార్థుల తల్లిదండ్రులపై నమ్మకం తీసుకురావాలని మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం విద్య వనరుల కేంద్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన ముఖ్య సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేలా ప్రతి గ్రామంలో ఈనెల 6 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు పాఠశాలలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ కట్ట రవీంద్రచారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఆర్.ప్రభాకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ఎల్. సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఏం.ఐ.ఎస్.కో ఆర్డినేటర్, సీఆర్పీలు పాల్గొన్నారు.