Chitram news
Newspaper Banner
Date of Publish : 02 June 2025, 12:40 pm Editor : Chitram news

సైదాపూర్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు *అమరుల త్యాగాలు మరువలేనివి

సైదాపూర్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

*అమరుల త్యాగాలు మరువలేనివి

చిత్రం న్యూస్, సైదాపూర్:

సైదాపూర్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, మహిళా సమాఖ్య, వ్యవసాయ, పాక్స్ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో భూక్యా యాదగిరి, వ్యవసాయ అధికారి వైదేహి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండారపు శ్రీనివాస్, పాక్స్ ఛైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, వివిధ గ్రామశాఖ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.