ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదవాడి సొంతింటి కల
*హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
చిత్రం న్యూస్ శంకపట్నం:
శంకరపట్నం మండలంని ముత్తారం గ్రామంలో భూమి పూజ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పదేళ్ల నిరీక్షణ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పేదలకు పంచుతుంటే వారి నుండి అనూహ్య స్పందన వస్తుందని,పేదవారి సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నామనన్నారు. ముత్తారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాగోని బస్వయ్య గౌడ్ కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. లబ్దిదారులకు పట్టాలు ఇస్తున్న క్రమంలో వారు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ మండలంలో ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదని,గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మాత్రమే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని,మళ్ళీ పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకునే నాయకులు నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విడతల వారిగా అర్హుడైన ప్రతి లబ్దిదారులకు పథకాలు అందజేస్తామని, రేషన్ కార్డులు,ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉచిత బస్ రవాణా సౌకర్యం లాంటి సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు యువకులు పాల్గొన్నారు.