Chitram news
Newspaper Banner
Date of Publish : 02 June 2025, 10:26 am Editor : Chitram news

రోడ్డు పనులు అలసత్యం పై కలెక్టర్ ఆగ్రహం

రోడ్డు పనులు అలసత్యంపై కలెక్టర్ ఆగ్రహం

చిత్రం న్యూస్,ఏలూరు :

తడికలపూడి నుండి జంగారెడ్డిగూడెం వరకు ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టిడిపి నాయకులు చింతలపూడిలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ కు,చింతలపూడి ఎంఎల్ఏ కు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఫిర్యాదు పై కలెక్టర్ స్పందిస్తూ రోడ్డు పనులకు నిధులు ఉన్నప్పటికీ ఎందుకు పనులు పూర్తి చేయడం లేదంటూ ఆర్ అండ్ బి అధికారులను ప్రశ్నించారు. మూడు రోజుల్లో  అండ్ బి రోడ్డు పనులు తెలుసుకోవడానికి తడికలపూడి నుంచి జంగారెడ్డిగూడెం వరకు స్వయంగా పర్యటిస్తానని, త్వరగా పనులు పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు.