Chitram news
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 10:41 am Editor : Chitram news

భవన నిర్మాణ కార్మికుల కూలీ రేట్లు పెంపు

భవన నిర్మాణ కార్మికుల కూలీ రేట్లు పెంపు

చిత్రం న్యూస్ సామర్లకోట:

ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కనస్ట్రాక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) సామర్లకోట పట్టణ కమిటీ సమావేశం ప్రకృతి ఈశ్వరరావు అధ్యక్షతన భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్బంగా ప్రకృతి ఈశ్వరరావు మాట్లాడుతూ..  పెరిగిన నిత్యావసర వస్తువులు ధరలు, గ్యాస్ ధరలు, కరెంట్ చార్జీలు, ఇంటి పన్నుల పెంపుదల కారణంగా భవన నిర్మాణ కార్మికులకు జీవనం కష్టంగా ఉండటం వలన, పెరిగిన ధరలకు అనుగుణంగా స్వల్పంగా కూలీ రేట్లు పెంచడం జరుగుతుందని జూన్ 1 నుండి నూతన కూలీ రేట్లు అమలులోకీ వస్తాయని భవన యజమానులు సహకరించవలసిందిగా కోరుతున్నామని చెప్పారు. పెరిగిన రేట్లు మేస్త్రికి గతంలో రూ. 850 ఉండేదని రూ.50 పెంచి 900,  అలాగే కూలీలకు గతంలో రూ.700కు రూ.50 పెంచి రూ.750 చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమం లో సంఘం ప్రతినిధులు బేవర బంగారయ్య, షేక్ బాషా, పి. శ్రీ రామ్, సీఐటీయూ మండల అధ్యక్షులు బాలం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, విప్పర్తి కొండలరావు, కరణం గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.