ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మూల ప్రేమ్ సాగర్ రెడ్డి
చిత్రం న్యూస్, ఓదెల:
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రజల మనిషి, ఎంఎల్ఏ చింతకుంట విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓదెల మండలం రూపు నారాయణపేట మానేరు నదిపై 80 కోట్ల రూపాయలతో హై లేవల్ వంతెన నిర్మాణం, ఓదెల మండల కేంద్రంలో 90 లక్షల రూపాయలతో మంచినీటి ట్యాంక్ నిర్మాణం, 13 కోట్ల రూపాయలతో ఓదెల గ్రామం నుండి పెగడపల్లి వరకు సెంటర్ లైటింగ్ తో రెండు వరసల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో విజయ రమణారావును ఓదెల మండల ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అదే స్ఫూర్తి , అదే సంకల్పంతో ప్రజాసేవకే అంకితమై ఓదెల మండలానికి మరెన్నో అభివృద్ధి పనులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితులైన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, చీకట్ల మొండయ్య, మాజీ ఎంపిటిసి బోడకుంట శంకర్, పొత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి, పెద్దపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపతి సదానందం, గడిగొప్పుల సంతోష్, మినుగు సంతోష్, పచ్చిమట్ల శ్రీనివాస్, గడిగొ ప్పల నరేష్, గొర్ల శ్రీనివాస్, నూతి శంకర్, పడాల రాజు, చొప్పరి రాజన్న,అంబాల కొమురయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.