సైదాపూర్ ఏ ఎస్ఐ మల్లారెడ్డి ఉద్యోగ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం
*ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ మాధవి
చిత్రం న్యూస్, సైదాపూర్:
పోలీస్ శాఖలో సేవలు అందించడం ఒక గౌరవమని సైదాపూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మల్లారెడ్డి అన్నారు. సుదీర్ఘ కాలం పాటు అంకితభావంతో విధులు నిర్వహించిన ఆయన శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సైదాపూర్ విశాల సహకార పరపతి సంఘం లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మల్లారెడ్డి తన సేవల ద్వారా సమాజానికి అనేక సేవలందించారని ఆమె ప్రశంసించారు. అనంతరం ఏసీపీ మాధవి మల్లారెడ్డికి జ్ఞాపిక అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకట్ గౌడ్, సైదాపూర్ ఎస్సై తిరుపతి, ట్రైనీ ఎస్సై భార్గవ్, శంకరపట్నం ఎస్సై రవి, హెడ్ కానిస్టేబుల్ సాబీర్, కానిస్టేబుల్స్ అశోక్, రాజు, అజయ్, నాగరాజు, సాయినాథ్, వెంకన్న, సాయి కృష్ణ, ఆకాష్, సురేష్, పూజ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.