Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

ఓదెలలో పోచమ్మ తల్లి  నూతన విగ్రహ ప్రతిష్ఠాపన 

ఓదెలలో పోచమ్మ తల్లి  నూతన విగ్రహ ప్రతిష్ఠాపన 

చిత్రం న్యూస్, ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పోచమ్మ తల్లి నూతన విగ్రహ  ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మంగళ వాయిద్య పూర్వక గంగ సేకరణ, యాగశాల ప్రవేశం ,గణపతి గౌరీ పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, పంచచార్యా, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, జలాధివాసం వంటి కార్యక్రమాలను పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కనీకిరెడ్డి సతీష్ మాట్లాడుతూ.. శనివారం రోజున విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ప్రముఖులు రానున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని విజయవంతం చేయగలరన్నారు. ఈ కార్యక్రమంలో కనకిరెడ్డి సురేష్, సదానందం, సారయ్య, పరుశురాం, కిరణ్ ,సాయి రమణ, రాజ్ కుమార్ ,రాజయ్య, అనిల్, ప్రభాకర్ , కనకయ్య , మల్లమ్మ, వనజ, తిరుమల, కీర్తి, లావణ్య, రాధా .మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments