జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు.
చిత్రం న్యూస్, కేశపట్నం :
జర్నలిస్టు రంగానికి వన్నెతెచ్చిన సీనియర్ పాత్రికేయుడు గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి అని శంకరపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోరేం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి వేడుకలను బుధవారం శంకరపట్నం మండలంలోని కేశవపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటానికి తహసిల్దార్ సురేఖ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఆలయ చైర్మన్ ఉప్పుగల్లు మల్లారెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవయ్య గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మైపాల్, ఏఎస్ఐ సుధాకర్, మాజీ ప్రజా ప్రతినిధులు రాములు, గట్టు తిరుపతి గౌడ్,గాండ్ల తిరుపతి,మోత్కూరి సమ్మయ్య, జర్నలిస్టులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కొరిమి వెంకటస్వామి,,దేవునూరి రవీందర్,, బూర్ల వెంకటేష్, నేరెళ్ల సంతోష్, కొరిమి సంతోష్, కత్తెరమళ్ళ కిరణ్,చింతం వెంకటేష్, గొర్ల అనిల్, తాళ్లపల్లి సాగర్, ఎల్కపల్లి సుధీర్, సంపత్ రెడ్డి, రాకేష్, తుమ్మ సుధాకర్, సురేష్, ప్రణదీప్, రంజిత్, తిరుపతి, అనిత్, పెద్ది గట్టయ్య, నరేష్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.