ఘనంగా కడప మహానాడు
*టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు
*మహానాడులో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
చిత్రం న్యూస్, పెద్దాపురం:
కడపలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానాడు మొదటిరోజు సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రజా ప్రతినిధుల నమోదు, ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. మా తెలుగు తల్లి గీతాలాపన అనంతరం మరణించిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు ప్రజాప్రతినిధులతో కలిసి సంతాపం ప్రకటించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగాపెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్పతో కలిసితిలకించారు.