Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం

సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం

*కేటీఆర్ సేన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్

చిత్రం న్యూస్, ఓదెల:

సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని కేటీఆర్ సేన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామంలో శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసు, మిస్ వరల్డ్ అవమాన ఘటన ప్రజల దృష్టిని మళ్లించడానికేనని ఆరోపించారు. సిరిసిల్లలో ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం

కాంగ్రెస్ వాదులు దాడిచేయడానికి యత్నించగా నాయకులు ధైర్యంగా అడ్డుకున్నారని, ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాపాలన అని చెప్పుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న నాయకులపై దాడులకు దిగడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిరంతరం నిలదీస్తామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img