Chitram news
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 4:36 pm Editor : Chitram news

తోషంలో కుటుంబ సమ్మేళనం

లోకమాత అహల్యాబాయి హోల్కర్ త్రి శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా తోషంలో కుటుంబ సమ్మేళనం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషంలో  సామాజిక సమసరత వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో కుటుంబ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సమరసత వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రావుత్ రవీందర్ తెలిపారు.  లోకమాత అహల్యాబాయి హోల్కర్ త్రి శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా మే 30న సాయంత్రం 6 గంటలకు తోషం లో కుటుంబ సమ్మేళనం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ హాజరవుతున్నారాన్నారు. సభ్యులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.