Chitram news
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 1:02 pm Editor : Chitram news

యోగాపై శిక్షణా కార్యక్రమాలు

యోగాపై శిక్షణా కార్యక్రమాలు

చిత్రం న్యూస్, సామర్లకోట: 

సామర్లకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయిలో యోగ శిక్షణా కార్యక్రమము ఏర్పాటు చేయడమైనదని ఎంపీడీఓ హిమ మహేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించుచున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాపై శిక్షణ ఇచ్చుటకుగాను గ్రామ స్థాయి సిబ్బందికి మే నెల 27 నుండి 31 వరకు ఉదయం 07.00 గం.ల నుండి 09.00 గంటల వరకు శిక్షణ ఇవ్వడానికి గ్రామ స్థాయి సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను మంగళవారం నుంచి మొదలుపెడు తున్నట్లు హిమ మహేశ్వరి తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని కోరారు.