Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులను చేర్పించాలి

ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులను చేర్పించాలి

*బొమ్మనపల్లి ప్రధానోపాధ్యాయులు పి. లక్ష్మణరావు


చిత్రం న్యూస్, చిగురుమామిడి:
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.లక్ష్మణరావు కోరారు. సోమవారం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, అంగన్ వాడి టీచర్స్,ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల నమోదు సంఖ్య పెంచడం గురించి కార్యాచరణ రూపొందించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విక్రమ్ కిరణ్ కుమార్, హై స్కూల్ ఉపాధ్యాయులు బాల్ రెడ్డి, సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img