Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

తిరుపతి వెళ్లే రైలు ఓదెలలో ఆపాలని కేంద్ర సహాయ మంత్రికి వినతిపత్రం అందజేత

తిరుపతి వెళ్లే రైలు ఓదెలలో ఆపాలని కేంద్ర సహాయ మంత్రికి వినతిపత్రం అందజేత

*సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్

చిత్రం న్యూస్, ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్ లో తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు ఆపాలని నార్త్ తెలంగాణ రైల్వే ఫోరం ప్రధాన కార్యదర్శి కలవేని శ్రీనివాస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి పెద్దపల్లి లో పలు రైల్ల తో పాటు పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద దేవాలయమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఓదెల లో తిరుపతి రైలు హాల్టింగ్ ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు. దీనికి ఆయన సంబంధిత అధికారుల తో మాట్లాడతానని సానుకూలంగా స్పందించారని తెలిపారు. అదే విదంగా హుజురాబాద్ డిపో కు చెందిన జమ్మికుంట నుండి సుల్తానాబాద్ మధ్య నడిచే బస్ లను వయా ఓదెల కనగర్తి మీదుగా నడిపే విధంగా చూడాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img