Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

Odelah: 32 రైల్వే గేట్ నుండి రోడ్డు పనులు ప్రారంభం

*తారక రామ  కాలనీ వాసుల ఆకాంక్ష  ఈ రోడ్డు 

చిత్రం న్యూస్, ఓదెలః
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో 32 రైల్వే గేట్ నుండి డీ 86 కెనాల్ బ్రిడ్జి వరకు రూ. 7 లక్షల వ్యయంతో కాంగ్రెస్ నాయకులు రోడ్డు పనులను బుధ‌వారం జేసీబీ సాయంతో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ఓదెల మండల ఆఫీస్ వరకు రెండు వరుసల రోడ్డు మంజూరు కాగా అనివార్య కారణాల వలన తారకరామ కాలనీ నుండి రోడ్డు పనులు నిలిచిపోగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు చొరవతో 32 రైల్వే గేట్ తారకరామ కాలనీ నుండి డీ 86 కెనాల్ బ్రిడ్జి వరకు రోడ్డు పనులు పూర్తి చేయనున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాజా మాజీ ఎంపిటిసి బోడకుంట లక్ష్మీ చిన్నస్వామి, చీకట్ల మొండయ్య, మీనుగు సంతోష్, గొర్ల శ్రీనివాస్, రాపల్లి రాజయ్య, అల్లం సతీష్, డాక్టర్ వెంకటేశ్వర్లు, క్యాతం తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img