జగదాంబ దేవి ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
చిత్రం న్యూస్, బోథ్;
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బుగ్గారం గ్రామంలో గల శ్రీ జగదాంబ దేవి అలాయాన్ని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ దర్శించుకొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు రాథోడ్ సురేందర్, నాని (నక్లు), పాండు, ప్రతాప్ తదితరులు ఉన్నారు.