Chitram news
Newspaper Banner
Date of Publish : 20 May 2025, 5:11 pm Editor : Chitram news

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్;
కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో భోరజ్ మండలంలోని సిరసన్న గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి కే వీ కే సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంటలలో ఎరువుల సమతా స్థితి, విచక్షణారహితంగా పురుగుమందులు వాడకుండా చూడడం, పంట మార్పిడి, నీటి సంరక్షణ పద్ధతులు, విత్తనము విత్తన రకాలు ,విత్తన రసీదు, చెట్లు నాటడం, పర్యావరణం కాపాడడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ సిద్ధార్థ, మండల ఉద్యానవన అధికారి, అలేఖ్య, ఏ ఈ వో తౌసిఫ్ పాల్గొన్నారు.