రైతుల ఆత్మహత్యలు బాధాకరం.. జోగు రామన్న.
చిత్రం న్యూస్, సాత్నాల;
రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోవడం బాధాకరమని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా ఆత్మ స్థైర్యంతో ఉండాలని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. సాత్నాల మండలం సుందరిగి గ్రామానికి చెందిన కొప్పుల లచ్చన్న అనే రైతు ఇటివల ఆత్మహత్య చేసుకోగా…. బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి పరామర్శించారు. అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కుటుంబ సభ్యులను కలిసి అధైర్య పడవద్దు అని ధైర్యాన్ని కల్పించారు.. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు సైతం అందకపోవడం రైతుని తీవ్రంగా కల్చవేసిందన్నారు.దిక్కుతోచని స్థితిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.. రైతులు ఆత్మ స్థైర్యంతో ఉండాలని, అన్నం పెట్టె అన్నదాత ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడవడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు కుటుంబాలలో తీవ్ర సంక్షోభం ఏర్పడే రైతు ఆత్మస్త్రాన్ని దెబ్బతీస్తుంది అన్నారు.. రైతులు ఎవరు అధైర్య పడకుండా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపిటిసి దేవన్న, సర్పంచ్ నర్సింగ్, పోచ్చన్న, కిష్టన్న, సంతోష్, పోతన్న, మునఫ్, కుమ్రా రాజు, ఉగ్గే విట్టల్ తదితరులు ఉన్నారు…