- *ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం చిత్రం న్యూస్ , ఆదిలాబాద్; జైనథ్ మండల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్యాధికారి ఏ. శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి జైనథ్ PSHM మరియు SGT ఉపాధ్యాయుల కు 5 రోజుల వరకు వృత్యంతర శిక్షణ కార్యక్రమంలిటిల్ ఫ్లవర్ స్కూల్ శాంతినగర్ లో నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమం గురించి కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. విద్యా విధానంలో సమూల మార్పులు చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ సిద్ధంగా ఉంద ని ,విద్యార్థులు లకు నూతన విధానం లో బోధన జరిగేలా చూడాలని అందుకే పాఠశాల ప్రారంభంకు ముందే ఉపాధ్యాయులకు శిక్షణను ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ శిక్షణ లో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొనలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల శ్రీనివాస్, జిల్లా సెక్టోరియల్ అధికారులు J నారాయణ, సుజాత్ ఖాన్, DEO CC రాజేశ్వర్, మండల రిసోర్స్ పర్సన్లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, mrc సిబ్బంది పాల్గొన్నారు.
