*28న తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం*
**తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలి రావాలని పిలుపు*
*చిత్రం న్యూస్ , ఓదెల;*
ఈనెల 28న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి తెలంగాణ ఉద్యమ నాయకులు , నాయకురాలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓదెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ,ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ , చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ,పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ , తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ తదితర ప్రముఖులు హాజరవుతారన్నారు. కావున జిల్లాలో ఉన్న ఉద్యమకారులు భారీగా తరలి వచ్చి తమ ఐక్యతను తెలియజేయాలని కోరారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి , చర్లపల్లి సురేష్ గౌడ్ , పలకల నరసింహా రెడ్డి , నూతి శంకర్ ,కందుల అశోక్ ,వేల్పుల కుమార్ , బూరుగుపల్లి పుల్లారెడ్డి , లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.