Chitram news
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 12:44 pm Editor : Chitram news

అడవిపంది ఢీకొని యువకుడు మృతి

బేల మండలంలో విషాదం 

చిత్రం న్యూస్, బేల: బేల మండలం సిర్నన్న గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అడవిపంది అడ్డురావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సిర్నన్న గ్రామానికి చెందిన ఆకాష్ గా గుర్తించారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా అడవిపంది రోడ్డుపైకి రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆకాష్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామంలో యువకుడి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.