ఫసల్ బీమా యోజన తక్షణ అమలుకు డిమాండ్: బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్
బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేల ట్రాక్టర్ ర్యాలీ చిత్రం న్యూస్, హైదరాబాద్: 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను రాష్ట్రంలో వెంటనే పునరుద్ధరించి, నష్టపోయిన ప్రతీ రైతుకూ పరిహారం అందించాలని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, పవార్ రామారావు పాటిల్, పైడి రాకేష్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్...