ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ రాజర్షిషా
ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ రాజర్షిషా చిత్రం న్యూస్, ఉట్నూర్: నర్సాపూర్ (బి) గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ (బి) గ్రామంలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు....