శ్రావణ మాసం పురస్కరించుకొని కేఆర్కే కాలనీలో నగర భోజనం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గతకొన్ని సంవత్సరలుగా ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో 7వ, 8వ వార్డుల్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద భజన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా శ్రావణ సోమ వారం పురస్కరించుకొని 7వ వార్డు కౌన్సిలర్ దుమ్మని రాము, 8వ వార్డు కౌన్సిలర్ నాగసెన్ మాన్కర్ లు పూజా కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. అనంతరం నగర భోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు లింగంపల్లి శశికాంత్, దేవాంత రమేష్, రవి, ముసలే ఈశ్వర్, ఎల్చాల పోచన్న, ఆలయ కమిటీ సభ్యులు బోడకుంట రాజు, సుభాష్, నవీన్, సార్ల బుజ్జన్న, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.