Chitram news
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 4:32 pm Editor : Chitram news

గురుజ గ్రామంలో జగదాంబ, సేవాలాల్ ఆలయాలను దర్శించుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్

గురుజ గ్రామంలో జగదాంబ, సేవాలాల్ ఆలయాలను దర్శించుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్

చిత్రం న్యూస్, గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండలం గురుజ గ్రామస్తుల పిలుపు మేరకు డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్ ఆదివారం గ్రామంలోని జగదాంబ, సేవాలాల్ ఆలయాలను దర్శించుకున్నారు. ముందుగా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరలో డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జగదాంబ అమ్మవారిని, సేవాలాల్ మహారాజ్ ను దర్శించుకుని, అమ్మవారి ఆశీస్సులతో, సేవాలాల్ మహారాజ్ కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు రాథోడ్ గణేష్, దుబ్బాక నరేష్, సిడాం శంకర్, బాలు శంకర్ తదితర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.