* భక్తులతో కిక్కిరిసిన శ్రీకృష్ణ ఆలయం
చిత్రం, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీకృష్ణ ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని గోపాలకృష్ణ స్వామి వారికి ఆలయ అర్చకులు భూమన్న యాదవ్ పాలు, పెరుగు, వెన్న, తేనె వంటి పంచామృతాలతో అభిషేకాలు జరిపి ప్రత్యేక నైవేద్యాలను సమర్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు.శ్రీకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రేపు శ్రీకృష్ణుని పల్లకి సేవ, చిన్నారులకు శ్రీకృష్ణుడి, రాధమ్మల వేషధారణ, ఉట్టి కొట్టడం పోటీలను ఏర్పాటు చేసి వారికి స్వామి వారి ప్రతిమలను అందజేయనున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.