Chitram news
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 5:18 pm Editor : Chitram news

బీఆర్ఎస్ ధర్నాలు సిగ్గుచేటు: వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ శివానంద రెడ్డి

బీఆర్ఎస్ ధర్నాలు సిగ్గుచేటు: వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నేత బండ శివానంద రెడ్డి

చిత్రం న్యూస్,జమ్మికుంట: పదేళ్లు ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రజాపాలన పై ధర్నాలు చేయడం సిగ్గుచేటని వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ శివానంద రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. ప్రజా పాలన చూసి ఓర్వ లేకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. మూడేళ్ల పాలనలో ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తుందని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేదవారికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో దళిత సీఎం, డబుల్ బెడ్రూం, 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ, నిరుద్యోగ భృతి, హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.