కీర్గుల్ (కె) ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు
కీర్గుల్ (కె) ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె)గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. పిల్లల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, రవళిక, భవాని, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.