Chitram news
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 5:27 pm Editor : Chitram news

వీబీ జీరాంజీపై ప్రత్యేక గ్రామసభ    

వీబీ జీరాంజీపై ప్రత్యేక గ్రామసభ    

చిత్రం న్యూస్, బాసర: బాసర మండలంలోని ఓని గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. వీబీ జీరాంజీ పథకం ద్వారా గ్రామంలో చేపట్టబోయే నూతన పనుల ప్రణాళిక రూపకల్పన కోసం ఈ సభను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జాదవ్ జగదీష్,ఉప సర్పంచ్. పురుషోత్తం,ఏపీవో సదానంద చారి, టెక్నికల్ అసిస్టెంట్ రాజు,పంచాయతీ కార్యదర్శి మధుకర్ రావు సంయుక్తంగా హాజరై,పథకం ద్వారా గ్రామానికి వచ్చే నిధులు, చేపట్టే పనుల గురించి గ్రామ ప్రజలకు సమగ్రమైన అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధికి కూలీలు,గ్రామస్తులు అందరూ సహకరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు, ఓని గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.