కరంజిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా◊ జైనథ్ మండలం కరంజి గ్రామంలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది.గ్రామ సర్పంచ్ శైలజ-పొచ్చన్న లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజలకు రేషన్ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏనుగు సూర్యారెడ్డి, వార్డు సభ్యులు, రేషన్ డీలర్, గ్రామస్తులు పాల్గొన్నారు.