హెచ్ఐవీ/ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షిషా
హెచ్ఐవీ/ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షిషా చిత్రం న్యూస్, ఆదిలాబాద్: హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్మూలనకు సమాజంలో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్-2026’లో భాగంగా శనివారం స్థానిక స్టేడియం వద్ద నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా...