Chitram news
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 7:18 pm Editor : Chitram news

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆట పరికరాలు అందజేసిన సామ రూపేష్ రెడ్డి

 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆట పరికరాలు అందజేసిన సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో బేల మండలం వరుర్ గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం ఆట పరికరాలను ఆయన అందజేసి మాట్లాడారు. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని వెనుకబడిన గ్రామాలలో చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారం అందించి క్రీడల్లో ముందుకు తీసుకెళ్లాలని సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.క్రీడల్లో ఆసక్తి కనబరిచిన విద్యార్థుల మేధాశక్తి ఎంతో ఉత్సాహంగా పనిచేస్తుందని చదువుపై కూడా ఆ ఉత్సాహం ఉపయోగపడుతుందని తెలియజేశారు. రానున్న రోజుల్లోనే విద్యార్థులకు అవసరమైన క్రీడా పరికరాలు అందించేందుకు తాను ముందుంటానని తెలిపారు. గ్రామ సర్పంచ్ ఆత్రం సంతోష్, ఉప సర్పంచ్ భారత్, టీచర్ వినోద్, మాజీ సర్పంచ్ టేకం ఆయ్యూ,వార్డ్ మెంబర్ విజయ్, యువ నాయకులు విపిన్ టాక్రే,నాయన్ తదితరులు ఉన్నారు.