రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం: సుహాసిని రెడ్డి
చిత్రం న్యూస్, బేల: గత ఏడాది పెన్ గంగా నది వరదల్లో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి ఆరోపించారు. బుధవారం బేలలో రైతులతో సమావేశమైన ఆమె, “గత డిసెంబర్లో జీవో ఇచ్చి నిధులు మంజూరు చేసినా ఆరు నెలలైనా రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం” అని విమర్శించారు. నష్టపరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అవసరమైతే ధర్నాలు, ర్యాలీలు చేస్తామని హెచ్చరించారు. “రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు” అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రైతులు, నాయకులు సుఖ్ దేవ్, గోపాల్ కడ్సే, వెంకట్ రెడ్డి, ప్రకాశ్, ఆశిష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.